నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

TG: నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని భూపాలపల్లి(D) పలిమెల(M)పంకెనకు చెందిన వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తనకు ర్యాంక్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగింది. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తండ్రి రాజయ్య తెలిపారు.



