ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?

బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులతో పాటు వారి చిన్న కూతురు సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పెద్ద కూతురు శ్వేత, ఆమె బాయ్ఫ్రెండ్ కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేసినట్లు డౌట్ పడుతున్నారు. శ్వేత చేసిన అప్పులు, కెన్నెత్తో కలిసి ఉండడం పేరెంట్స్కి నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసి, ఆ ఇద్దరూ పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు.



