కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు..ట్రాఫిక్ జామ్
TG: హైదరాబాద్లో కాంగ్రెస్ ‘లోక్భవన్’ ముట్టడికి పిలుపునిస్తే, బీజేపీ లీడర్లు 'గాంధీ భవన్' వైపు దూసుకొచ్చి ముట్టడించడానికి ట్రై చేశారు. దీంతో నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపూల్ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడడంతో బండ్లు ఆగిపోయి జనాలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రెండు పార్టీల లీడర్లు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.



