CM ఉన్న విమానం గాల్లోనే చక్కర్లు.. ఉత్కంఠ

TG: ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న CM రేవంత్ రెడ్డికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తుది క్లియరెన్స్ అందకపోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి చివరికి సేఫ్గా దించారు. రన్వేపై ల్యాండింగ్ ప్రయత్నాన్ని నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.



