సీఎం విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ!

తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధితులకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని స్పష్టం చేసింది. బాధితులకు ఉద్యోగాల కల్పనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.



