← Back to news

కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే

By Karimulla· 23 Aug 2026· Vinukonda
కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే

AP : కళలను, కళాకారులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నాయకులు చంద్రనాయక్, పెంచలయ్య అన్నారు. వినుకొండలో జరిగిన పల్నాడు జిల్లా సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వ సాయం లేక రాష్ట్రంలో నాటకాలు, కళల పరిస్థితి బాగా పాడైపోయిందని బాధపడ్డారు. ప్రత్యేక శాఖ ఉన్నా కళాకారులకు పైసా ఉపయోగం లేదని, బడ్జెట్‌లో డబ్బులు పెట్టకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని అడిగారు. ప్రజల కష్టాలను బయటపెడుతూ, కొత్త పాటలు, నాటకాల ద్వారా జనాల్లో మేల్కొలుపు తేవడానికి తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు.

More in Local