కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, నూతన కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కమిటీ పనిచేయాలని ప్రముఖులు ఆకాంక్షించారు.


