టీవీకే రైతులను మోసం చేసింది: ఉదయనిధి స్టాలిన్

పూర్తి రుణమాఫీ ఇస్తామని మాట ఇచ్చిన టీవీకే ఇప్పుడు పాక్షికంగా అమలు చేసి రైతులను మోసం చేసిందని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. డెల్టా రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రభుత్వ వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలిపామని అన్నారు. మేకెదాటు డ్యామ్కు నీళ్లు ఇవ్వం అని క్లారిటీ ఇచ్చిందని, సీఎం విజయ్ని కర్ణాటకకు రావద్దని కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీల సమావేశం పెట్టాలని కోరారు.


