శిశు మరణాలపై డీఎంహెచ్ఓ సమీక్ష.. కారణాల విశ్లేషణ తప్పనిసరి!

జగిత్యాల జిల్లాలో శిశు మరణాల నివారణకు అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జి. సుజాత సూచించారు. గురువారం సమీక్షలో హైరిస్క్ గర్భిణీల పర్యవేక్షణ, ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, అత్యవసర రిఫరల్ సేవలపై చర్చించారు. ప్రతి మరణానికి కారణాలను విశ్లేషించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.





