← Back to news

నదుల అనుసంధానంతో కరువుకు చెక్

By DK· 19 Jul 2026· కృష్ణా జిల్లా
నదుల అనుసంధానంతో కరువుకు చెక్

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 48 శాతం వర్షాభావం నమోదైనా సాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 450 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి రూ.50 వేల కోట్ల విలువైన పంటలను కాపాడామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానంతో కరువు సమస్యను అధిగమిస్తామన్నారు.

More in AP