మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి

పూణేలో ఘోరమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల యువకుడు మహేష్ గైక్వాడ్ను అతని తండ్రే కొట్టి చంపేశాడు. దీనికి కారణం మటన్. శ్రావణమాసంలో కొన్ని కుటుంబాలు నాన్ వెజ్ తినరు. మహేష్ కుటుంబం కూడా అలాగే తినడం లేదు. కానీ ఇంట్లోనే మటన్ వండాలని అతను బలవంతం చేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య వాదన జరిగింది. దీంతో కోపంతో కొడుకును బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ మహేష్ చనిపోయాడు.



