రేపే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం

AP: రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ను పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.



