← Back to news

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

By Srikanth Goud Podeti· 24 Aug 2026· Jagitial
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

TG: జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి 53 ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీపై సమగ్ర విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 182 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటిలో 93 దరఖాస్తులు 30 రోజులకు పైగా పరిష్కారం కాకుండా ఉన్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

More in Local