ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు !

చత్తిస్ గఢ్ లో ఓ యువకుడు ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు. గుట్కాకు బానిస అయిన అతగాడు తల్లిని ఐదు రూపాయలిమ్మని వత్తిడి చేశాడు. ఆమె ఇవ్వక పోవడంతో ఆమెను ఏకంగా హత్య చేశాడు. లఖన్ మాలి అనే ఆ యువకుడు తల్లి తిహ్రిన్ మాలి భోజనం వడ్డిస్తుందగా ఆమెను ఐదు రూపాయలు ఇవ్వమని వేధించాడు. ఆమె లేవని చెప్పడంతో కోపం పట్టలేక ఆమెను తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని పారిపోతున్న ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. ఆమె మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి లఖన్ ఆలీని అరెస్టు చేశారు.



