రామగుండం సీపీ గ్రీవెన్స్ డే

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(పరిపాలన) కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.




