ఫంక్షన్ నుండి వస్తే శవమై కనిపించింది!

అస్సాంలోని హైలాఖాండీ జిల్లాలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఫంక్షన్కు వెళ్లి కజిన్తో గొడవపడి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చిన బాలిక, కుటుంబ సభ్యులు వచ్చేసరికి తల, ముఖం గుర్తుపట్టలేనంతగా విదంగా శవమై కనిపించింది. ప్రైవేట్ భాగాల్లోకి రాడ్ తో నెట్టి, లైంగిక దాడికి ఒడిగట్టినట్లు కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టగా, ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



