← Back to news

స్కూల్ డాబాపై యువకుడి దారుణ హత్య

By rk· 1 Aug 2026
స్కూల్ డాబాపై యువకుడి దారుణ హత్య

AP: నెల్లూరు జిల్లా గూడూరు పక్కన ఉన్న విందూరులో ప్రైమరీ స్కూల్ డాబా మీద షాహుల్(21) అనే కుర్రాడు రక్తమడుగులో చనిపోయి వున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి. రక్తం ఎక్కువగా పోవడం వల్లే అతడు చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్న ఆధారాలు చూస్తుంటే ఎవరో గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.