నీట్ వ్యవహారంలో కేంద్రం జవాబుదారీతనం వహించాలి: అన్నామలై

నీట్ ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు మద్దతుగా నిలిచిన కె.అన్నామలై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నీట్ వ్యవహారంపై జవాబుదారీతనం కోరారు. వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ రావడం సహజమేనని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.



