నర్సంపేటలో కన్నుల పండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డా. వనజ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారని, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మం, స్నేహం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి, చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాల ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.



