పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టి సారించాలి

గుండ్లపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల సమీపంలోని మురికి కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతున్నారు.



