గ్రీన్ కవర్ పెంచి పర్యావరణ పరిరక్షణ చేద్దాం

AP: రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల ఆరోగ్యకర జీవనానికి గ్రీన్ కవర్ను పెంచాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె.నాగబాబు అన్నారు. ప్రస్తుతం 29 శాతంగా ఉన్న గ్రీన్ కవర్ను 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. మొక్కల సంరక్షణను జియోట్యాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్ద చెట్టు తొలగిస్తే పది మొక్కలు నాటే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపును ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

