పుష్ప స్టైల్లో గంజాయి స్మగ్లింగ్

AP: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద గంజాయి స్మగ్లర్ల గుట్టు ప్రమాదంతో బయటపడింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం రోడ్డు అంచు దాటి గుంతలో బోల్తా పడగా, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పరిశీలించగా, ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో గంజాయి పెట్టెలు కనిపించాయి. తహసీల్దార్ సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 213 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.



