← Back to news

పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్

By dk· 3 Aug 2026· నెల్లూరు జిల్లా
పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్

AP: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద గంజాయి స్మగ్లర్ల గుట్టు ప్రమాదంతో బయటపడింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం రోడ్డు అంచు దాటి గుంతలో బోల్తా పడగా, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పరిశీలించగా, ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో గంజాయి పెట్టెలు కనిపించాయి. తహసీల్దార్ సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 213 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.