జర్నలిస్ట్ ఫోటో మార్ఫింగ్ చేసిన వారిని శిక్షించాలి: DMJU

మహిళా జర్నలిస్టు ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాన్ని ఖండిస్తున్నట్లు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) రాష్ట్ర అధ్యక్షులు కే.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ తెలిపారు. హైదరాబాద్లో CJP నిర్వహించిన సమావేశాన్ని వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టును లక్ష్యంగా చేసుకుని ఆమె ఫోటోలను మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఫోటోను మార్ఫింగ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



