విద్యార్థుల విజయాన్ని CM ఖాతాలో వేసుకోవడం సరికాదు

TG: నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థుల విజయాన్ని CM రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు. ఇది పూర్తిగా స్టూడెంట్ విజయమని స్పష్టం చేశారు. యువత ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిందని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా CM కొత్త ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మరని ఆమె ఫైరయ్యారు.



