← Back to news

ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య

By Vishi· 22 Aug 2026
ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య

IIT ఢిల్లీ క్యాంపస్‌లో ఇవాళ ఉదయం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన ఎం.ఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేశ్ కుమార్‌(31) లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఈ ఘటనకు గల కారణాలు తెలియలేదు. క్రైమ్ టీమ్, FSL టీమ్ సాక్ష్యాలు సేకరించాయి. మార్చి నుంచి IIT ఢిల్లీలో రెండో ఆత్మహత్య ఇది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.