ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య

IIT ఢిల్లీ క్యాంపస్లో ఇవాళ ఉదయం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్కు చెందిన ఎం.ఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేశ్ కుమార్(31) లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఈ ఘటనకు గల కారణాలు తెలియలేదు. క్రైమ్ టీమ్, FSL టీమ్ సాక్ష్యాలు సేకరించాయి. మార్చి నుంచి IIT ఢిల్లీలో రెండో ఆత్మహత్య ఇది.



