బస్సు బోల్తా..29 మందికి గాయాలు

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శకుంతల ఫ్లైఓవర్పై స్టూడెంట్స్తో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రాత్రి జరిగిన ఈ ఘటనలో 29 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. వాళ్లని వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


