← Back to news

పేదల కోసం సత్రం ప్రారంభం

By rajaratnam· 4d ago
పేదల కోసం సత్రం ప్రారంభం

భీమావారిపాలెంలోని పేద ప్రజల అవసరాలకు కంబాల రంగయ్య సత్రం అండగా నిలవనుంది. రూ.56 లక్షలతో పునర్నిర్మించిన సత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. సత్రంలో నాలుగు వసతి గదులు, భోజనాలు ఏర్పాటు చేసుకునేందుకు హాలు అందుబాటులోకి వచ్చాయి. అద్దె ఇళ్లలో నివసించే పేదలు, అవసరమైనవారు ఇక్కడ నిద్రించడంతోపాటు భోజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని సతీష్ తెలిపారు. పేదలకు సత్రం ఉపయోగపడేలా ట్రస్ట్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు.

More in Local