← Back to news

ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు

By RK· 31 Jul 2026
ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు

TG: NEET పేపర్ లీక్ గొడవల టైమ్‌లో PM నరేంద్ర మోదీకి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై BJP మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు నడుపుతున్న వారితో పాటు మెటా ఇండియా హెడ్‌పై కూడా ఈ కేసులు పెట్టారు. ఆ వీడియోల లింకులు వెంటనే తీసేయాలని మెటా సంస్థకు పోలీసులు నోటీసులు పంపారు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ల వివరాలు ఇవ్వాలని అడిగారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు చెప్పారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.