గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురు క్షేమం

AP: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారె చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి సురక్షితంగా కాపాడారు. చిన్నయ్యతో పాటు మరో నలుగురు మత్స్యకారులు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే వారు వాణిజ్య నౌకపైకి ఎక్కలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆచూకీ ఇంకా తెలియని మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.



