← Back to news

రాఖీ పౌర్ణమి వేళ బీజేపీ నేతలతో ఆత్మీయ కలయిక

By saikiran· 28 Aug 2026
రాఖీ పౌర్ణమి వేళ బీజేపీ నేతలతో ఆత్మీయ కలయిక

TG: రంగారెడ్డి జిల్లా హఫీజ్‌పేట్ డివిజన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేశ్ యాదవ్ శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అనుషా మహేశ్ యాదవ్ పేర్కొన్నారు.

More in Local