← Back to news

విద్యార్థి నాయకులకు బాధ్యతల అప్పగింత

By A VIJAY KUMAR· 39m ago· Narsampet (Ct), Narsampet, Warangal
విద్యార్థి నాయకులకు బాధ్యతల అప్పగింత

TG: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించడమే ఇన్వెస్టిచర్ సెరిమనీ ఉద్దేశమని నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ కె.అమర్నాథ్ తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెరిమనీ నిర్వహించారు. ముఖ్య అతిథి AGM పద్మాకర్ నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి బాధ్యతలు అప్పగించారు. అనంతరం విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థుల మార్చ్‌పాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

More in Local