బైక్పై వెంబడించి డ్రైవర్, కండక్టర్పై దాడి

AP: బస్సు ఆపలేదని యువకుడు RTC సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు కోసం బస్టాప్లో ఎదురుచూస్తుండగా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు బైక్తో వెంబడించాడు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ సురేశ్, కండక్టర్ లీలా ప్రసాద్పై దాడి చేశాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతోనే ఆపలేదని తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా యువకుడు వినలేదు. ఘటనతో కరకట్ట రూట్లో గంటసేపు ట్రాఫిక్ జామ్అయింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



