ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు

TG: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న నస్పూర్ 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మయ్య, పైలెట్ సత్తయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

