← Back to news

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు

By Mahesh· 22 Jul 2026
'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు

AP: మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన మూడువేల మంది పేద లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ శాశ్వత భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 'మన ఇల్లు–మన లోకేష్' కార్యక్రమ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చామని తెలిపారు. భూమి హక్కు పత్రాలతో లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ మురుగునీటి పారుదల, 24 గంటల తాగునీటి సరఫరా, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

More in AP