← Back to news

అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి

By epuri rajaratnam· 29 Aug 2026
అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి

AP: గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్‌రోడ్డులో డ్రెయిన్‌ నిర్మాణం కోసం ఇప్పటికే నాటిన మొక్కలను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో మొక్కకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ప్రజాధనం ఖర్చు చేస్తున్న సమయంలో, నిర్మాణ పనుల పేరుతో వాటిని తొలగించడం పర్యావరణానికి, ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించడమేనని విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో డ్రెయిన్‌ పనులు చేపట్టి ఉంటే మొక్కలను కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి

More in Local