మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేత

TG: సంచార, విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక నారాయణ నేతృత్వంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విముక్తి జాతుల దినోత్సవం–2026 నిర్వహణ, సంక్షేమ అంశాలపై చర్చించారు. బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, MBC కార్పొరేషన్ CEOతో చర్చించి త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.



