ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మీ అకౌంట్లో రూ.38,500 వేశామని, ఆ డబ్బులు మీకు రావాలంటే ముందు ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాలని అడుగుతున్నారు. ఇలాంటి కాల్స్ అస్సలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లో పడతాయి కానీ, అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. మీ ఫోన్ పే లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకండి అని పోలీసులు సూచిస్తున్నారు.



