← Back to news

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం

By RK· 31 Jul 2026
ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మీ అకౌంట్లో రూ.38,500 వేశామని, ఆ డబ్బులు మీకు రావాలంటే ముందు ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాలని అడుగుతున్నారు. ఇలాంటి కాల్స్ అస్సలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లో పడతాయి కానీ, అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. మీ ఫోన్ పే లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకండి అని పోలీసులు సూచిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.