వాడపల్లిలో అష్టోత్తర పూజలకు పోటెత్తిన భక్తులు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం అష్టోత్తర పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఏడు వారాల నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మోరంపూడికి చెందిన చనుమూరి లక్ష్మీ వెంకట గణపతి, ఆయన కుటుంబసభ్యులు నిత్య అన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేశారు.



