KTRను కలిసిన జెన్-జీ యువతులు

TG: రాజకీయాలపై మక్కువతో, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న నలుగురు జెన్ జీ యువతులు KTRను కలిశారు. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి మాట్లాడారు. లండన్లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ నేతలుగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. సమాజంలో మార్పు కోసం నలుగురు ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకోవడంపై KTR అభినందించారు.



