CAను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

TG: ట్రేడింగ్లో భారీ లాభాల ఆశచూపి రంగారెడ్డి జిల్లాలోని గండిపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నరసింహారెడ్డిని సైబర్ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. ఈమెయిల్, టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన మోసగాళ్లు ప్రత్యేక ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేయించి మొదట రూ.2లక్షలు పెట్టుబడి పెట్టించారు. 12రోజుల్లో 52విడతల్లో బాధితుడి నుంచి ఏకంగా రూ.2.45 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారు. డబ్బులు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. నిందితులు స్పందించక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.



