ప్రభుత్వ సేవలకు టైమింగ్ లేదా?

AP: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి సచివాలయం–1లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ధ్రువపత్రాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల పనుల కోసం సచివాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి సిబ్బంది కోసం వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సచివాలయంలో సమయపాలన పాటించాలని కోరుతున్నారు.

