ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్

AP: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మాన్యుయేల్(35)పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న గురజాల DSP ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు ముమ్మరం చేశారు.



