కలెక్టరేట్ వద్ద గిరిజనుల ఆందోళన.. ఉద్రిక్తత

AP: అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గ్రామాలకు చెందిన గిరిజనులు నిరసన నిర్వహించారు. గ్రామస్థులకు తెలియకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే ఎలా నిర్వహిస్తున్నారని మజ్జివలస ప్రాంత గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రో వపర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సర్వే చేయడం లేదని జిల్లా కలెక్టర్ నిషాంతి స్పష్టం చేశారు.



