రాజీనామాపై తేలని చర్చలు.. ఉత్కంఠ

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, CJP మధ్య జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రభుత్వం మరో 24 గంటల సమయం కోరింది. లీకేజీల నియంత్రణకు కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణ సంస్థలో పలువురు సిబ్బందిని తొలగించగా, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఇవాళ ఉత్కంఠ నెలకుంది.


