సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ పొడిగింపు

AP: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ను బాధిత కుటుంబాల విజ్ఞప్తితో అధికారులు పొడిగించారు. రేపు మధ్యాహ్నం 12గంటల వరకు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లి వస్తున్న క్రమంలో సముద్రంలో బోటు గల్లంతు అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఏడుగురు ఉండగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా ఆరుగురు మత్స్యకారుల కోసం ఇప్పటికే 72గంటల పాటు నేవీ, కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టాయి. వారి ఆచూకీ దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.



