← Back to news

ఆస్తి కోసం తండ్రినే నమ్మించి మోసం చేశారు

By DK· 30 Jun 2026· సూర్యాపేట జిల్లా
ఆస్తి కోసం తండ్రినే నమ్మించి మోసం చేశారు

TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన ఏనిగ ఎల్లారెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపైనే ఆయన ఆధారపడి జీవిస్తున్నాడు. ఎల్లారెడ్డికి ముగ్గురు కూతుర్లు పాశం లక్ష్మమ్మ, చిదుముల్ల మల్లేశ్వరి, కుంట్ల సునీత తమ భర్తలతో కలిసి తండ్రిని నూతనకల్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వృద్ధాప్య రక్షణ కల్పిస్తామని నమ్మించి ఆయనకు తెలియకుండానే సంతకాలు చేయించుకుని భూమిని తమ పేర్లపై మార్పిడి చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఆరోపించారు. కన్నకూతుర్లే తనను మోసం చేశారని, తిరిగి నా పేరిట పాస్‌బుక్ ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

More in TG