ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలి: నేహా బోరా

TG: ప్రజాస్వామ్యాన్ని, హక్కులను పరిరక్షించుకోవాలంటే యువత భయపడకుండా ప్రశ్నించే ధైర్యాన్ని పెంచుకోవాలని AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, JNUSU మాజీ అధ్యక్షుడు సాయి బాలాజీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని లామకాన్లో జరిగిన 15వ హాసన్ మెమోరియల్ లెక్చర్-2026లో వారు మాట్లాడారు. ద్వేష రాజకీయాలకు ముగింపు పలికే విధంగా యువత నిలవాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో యువత, విద్యార్థుల పాత్రను గుర్తుచేస్తూ ఖుదీరామ్ బోస్, భగత్సింగ్, అష్ఫాఖుల్లా ఖాన్ త్యాగాలను ప్రస్తావించారు.



