← Back to news

దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ

By DK· 8 Jun 2026· Samayam· మహబూబాబాద్ జిల్లా
దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ

TG: మృగశిర కార్తె సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండా వాసులు పెద్దఎత్తున కురవి పెద్దచెరువు వద్దకు తరలివచ్చారు. చెరువులో చేపల వేటకు దిగారు. భారీగా వలలు, గాలాలు వేసి చేపలను పట్టుకున్నారు. వలలు లేని వారు.. చీరలు, లుంగీలలో దొరికిన కాడికి చేపలను దోచుకున్నారు. విషయం సొసైటీ సభ్యులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. చెరువు వద్ద ఉంచిన 60బైక్‌లను, వలలు సీజ్ చేసి 14మందిని అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.