← Back to news

శ్మశానానికి రైల్వే పట్టాలు అడ్డు.. గ్రామస్తులు ఆందోళన

By Mahesh· 1 Aug 2026

AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేక గ్రామ ప్రజలు రైల్వే పట్టాలు దాటి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ప్రాణాలను పణంగా పెట్టి రైల్వే లైన్ దాటాల్సివస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

More in News