ఒకే వేదికపై 200 మంది కళాకారులు

TG : పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలంలో ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో జానపద వేడుకలు ఘనంగా జరిగాయి. కృషి కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 200 మంది జానపద, శాస్త్రీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కళాకారుల కోసం ఒక ఆడిటోరియం నిర్మించాలని సంస్థ అధ్యక్షుడు రాజమౌళి పాలకులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు.




